Thursday, September 10, 2015

well as all INDIANS

Sunday, 11 January 2015 at 05:58 UTC+05:30


  శ్రీ రంగనాధ దివ్య సన్నిధి





  శ్రీ రంగనాధ దివ్య సన్నిధి సాక్షాత్తూ శ్రీమన్నారాయణ యోగనిద్రాముద్ర సుమండీ. ప్రపన్న జీవి స్వామిని ఏకైక పరమాత్మగా ఎంచి శ్రీ వైష్ణవ స్వభావములో లీనమై ఆమరణానతరము జీవక ప్రాణముగా స్వామికి కైంకర్యమౌతుంది. ఉళగళందస్వామిగా మూడడుగులతో పృధ్వ్యాప్తావరణమొత్తాన్నీ స్మూక్షము చేసి మూడో అడుగును మహా బలిశీర్షముగా గ్రహించారు.స్వామి వునికికి నభోవిశ్వాంతరాళము చాలకపోయినప్పుడు పరమ భక్తుల హృదయములో ఆయన చక్కగా స్తిత మయి నట్టి విషయము మనకు మహాబలి వుదంతము వల్ల తెలుస్తుంది. స్వామి ఏకైకమూ, ఆవరణము ఘనమూ అనగా త్రిమూర్తిత్వమూను, నవ గ్రహాలూ ప్రదక్షిణ అర్చన తపో స్తితిలో స్వామిసేవనములో లీనమయి వుంటాయి. ఇరువది ఏడు తిరు నక్షత్రాలూ కూడా వాటి కాంతి వేగాలతో స్వామి ప్రదక్షిణ నమస్కార విషేష పూజలలోనే వెలుగొందు తూ వుంటారు. ఇరువది ఏడవ పాసుర పరి పూర్తికి వె`ర్రి గొల్లల సరిసాటికాని సమస్తలోకాలూ కూడా స్వామి పాదాలని మనో జ్ఞాన భక్తి ప్రపత్తులతో పూజించుకుంటారు. ఇక వైభోగ పాశుర నైవేద్య సమర్పణము వుచితమైన కార్యమే. అత్యంత రుచికర పేయతోయమధురఫల పంచామృతయుక్త మైనదే కూడారు ప్రసాదము. ఈ తోజు ఇది స్వీకరించి స్వామి వారికి చేసిన చిన్న చిన్న పూజలకి పెద్ద మనసుతో ఆదరించమని కోరుకుంటూ అన్ని అలంకరణలూ చేసుకుని పరమానందముగా వారితోడిగా ఆరగిస్తారు. కన్నడికి నెయ్యి ముదమైనది గదా అందుకని కూడారు నిండారా నెయ్యి వేస్తాము కదా, ఆ నెయ్యి మా మోచేతులక్రిందికి మేము ప్రసాదాన్ని ఆరగించేటప్పుడు దిగజారదూ. అంటే భక్తి రసాత్మకమై తనువుని తృప్తము చేస్తున్నదని భావము కదూ.

No comments:

Post a Comment