మలిన కలిత స్పర్శలు
కిందైనా పైనైనా భూమాతని అంటిపెట్టుకునే వుంటున్నాము.
సంతోషమూ,ధుఖమూ సరి సమంగానే అనుభవిస్తున్నాము.
అక్కడా ఇక్కడా ఆకాశ హర్మ్యాలూ హిరణ్మయ పాత్రలూ
పూరిళ్ళూ, నిరుపేదల దిగంబర కూడళ్ళూ
రంగుల బొమ్మల పత్రికలో శీర్షిక లేని పద విన్యాసాలే.
మనిషీ మరి దౌష్ట్యమెందుకు? జీవితము మొలిచి నిలిచిపోయేదే కద!
పద! కవితల దాహం తాగి, సద! సద్వివేకాన్ని నేరుద్దాము.
మది లో మలిన కలిత స్పర్శలు తుద ముట్టించి
మానవులమైతే ఏలోకమైనా బాధల భావాలోక్కటని,
భవ్యమైన జీవనానికి భాషోక్కటేనని ప్రపంచమంటే
గిర గిర తిరిగే బంతేనని తెలుస్తుంది,కానీ కాలితో కొట్టకు దాన్ని
. పుట్టనీ మట్టినీ మట్టకు. చేట్టునీ చేమనీ కొట్టకు.
ధరిత్రి దీవెనా,అమ్మ దీవెనా నీ కొమ్ము కాస్తుంది.కోరిక తీరుస్తుంది.
వశ్వైక్యత లేని కావ్యమూ, విషయ స్పష్టత లేని ప్రకటనా, వుద్వేగం నడిపించే వుద్యమమూ, వెలుగుని తిరస్కరించే దృష్టి సహేతుకమైన లక్ష్యాలని సాధించలేవు. పని ఆపడము,వూపిరి తీసుకోవడమూ చైతన్యాన్ని స్తబ్దమూ చేయడమూ, సందేహాన్ని పాతిపెట్టడమూ, ఖననము చెయ్యాలా దహనము చెయ్యాలా అని కొట్టుకు చావడమూ,సమస్యలని పరిష్కరించవు
No comments:
Post a Comment