నేనని చెప్పుకొన్న,'అహా మందురు,కాని
నే' నాత్మను నిక్కముగ యహమనునది
ఇహమున నా వునికికి వూపిరి,యదిలేక
జీవఛవము పగిది నైచ్యమునొందెద
ఇహపరములనేనాత్మయయ్యు,ఇహమున
పరమాత్మను జేరనెంచెద,పరిభావన
గుణ పరిగణణ మనము చేకొన్న
పరిమళించదె ఆత్మ ప్రయాస
నా దేహము పంచభూత సమ్హిత
బద్ధ జీవిగ,బుద్ధి జీవిగ వసింతు
తెరపు మరపున,దేహపాశనై,.
బద్దత దేహ ప్రవృత్తి, బుద్ధి
వికసించిన వివేకమండ్రు
యది యాత్మాశ్రయము
ఆత్మధారణమున దేహము
గుణత్రయతేజోమయమగు
తేజస్సు ప్రాణమై వ్యక్తిత్వమేర్పడును .........
No comments:
Post a Comment