జీవనచిత్రాలు
నాటి విచిత్రాలు
నీటిలో చేప పిల్లలు
మా కళ్ళకు ఆ స్మృతులు
రస స్ఫోరకాలు
అరెరే నీకధ ఇప్పటిదాకా చూడనే లేదు. Bale ఉంది గదూ. నేను ఈకథ చదుతూ ఇది సోవియట్ భూమిలో కథ అనుకున్నా. అచ్చంగా టాన్య కథ నో హతింతా య్ కదో అనుకున్నా. కీప్ the stories go నాన్నగారు పాపాయి కి ఈగ కవిత నేర్పించే వారు.ఇదిగో ఇలాంటి చిట్టి చిట్టి కథా కవనమే అది. Go my brother ow original and beautiful spree of dialogues.
నాన్నగారు చాలా ఫెయిర్ కాంప్లెక్షన్. పొడుగని తెలుస్తూనే ఉండేది. పంచె కట్టు. మద్రాసులో హిందీప్రచార్ సభ ఉద్యోగం చేసే అప్పటినుంచీ ఆయన వేషమదే. హిందీ ప్రావీణ్యత సంగతి కోనేరు పేట ఆయనకి ట్యూషన్ చెప్పేటప్పుడు తెలిసింది. నూజివీడు రైల్వే స్టేషన్లో ఒక సాయబు గుర్రం బండి వాడుండేవాడు. ప్రయాణీకులు బాగా తక్కువ. ఫ్రీక్వెంట్ ప్యాసింజర్స్ పైగా సెకండ్ క్లాస్ ట్రావెలర్స్ గుర్తుండేవారేమో, తాతగారు ఫ్రీక్వెంట్ ట్రావెలర్. నాన్నగారు ఈ సాయబుతో తురకం మాట్లాడేవారు. స్టేషన్లో ఆరవ అతని క్యాంటీన్ స్టాల్ ఉండేది. అతనితో తమిళం అనర్గళంగా రైలోచేదాకా మాట్లాడుతూనే ఉండేవారు. అమ్మ మొహను భట్టరు అనపర్తి వెళ్లిన రెండు మూడురోజులకు పెద్దక్కా, సత్యం చిన్నీ శిరీషు పాప్లీ నేను నాన్నగారితో తుని వెళ్ళాము.రైలు రద్దీగానే ఉంది. చాలాసేపటి సాయంత్రమవుతోందనుకుంటా , అనపర్తి చేరుకున్నాము. రంగడు మామ ఇంటికెళ్ళము. చాలా కోలాహలం గా ఉంది. అమ్మకి పిల్లా మేకా తో అల్లా రావడము నచ్చలేదు. బహుశా వద్దని ముందు చెప్పిందేమో! నాకు రాత్రి కొంచం తేడా హడావుడి కి మెలకువ వచ్చింది తెల్లారిపోతొందప్పటికీ. కుర్చీలో ఒక యువకుడు కళ్ళజోడుతో కనిపించాడు. మర్యాద అంటేనే అలాంటిది చేస్తున్నారు. నిశ్శబ్దంగా ఆడవాళ్ళు చిరునవ్వుతోటి, పిల్లలు నోరుమూసుకుని ఆయన కేసి కళ్ళప్పగించి చూస్తున్నారు. చాలా అందగాడే. మద్రాసులో నేను N T రామారావు, జెమినీ గణేషన్ సావిత్రిల పోస్టర్లు చూసి వాళ్ళందరూ దేవతలనుకొనేవాడిని. ఇతగాడు అలానే కనిపించాడు. పైగా అందరి మర్యాద ఆదరణ . ఇతను మంగట్ట గారి కొడుకు కిష్టి అని తెలిసింది. ఇతనప్పటికే MBBS పాసై కాకినాడలో ట్రైనింగ్ అవుతున్నాడట. రంగడు మామ I L T D కంపెనీ లో పనిచేసేవాడు.
కిష్టి చూడడానికి స్ఫురద్రూపి పైగా డాక్టరీ
ఈ వాళకూడా డాక్టరీ చెయ్యడం కష్టసాధ్యమేకదా.పైగా మన శ్రీవైష్ణవ కుటుంబాల్లో మెదటి వైద్యుడేమో and then most eligible bachelor గాబోలు.
ఎవరి ఆలోచనలువారివి కనుక మర్యాదగా మన్ననలకు ఏ మాత్రం లోటు ఉండే అవకాశం లేదు!
అతిశయమున్న చదువరైన చురుకు కుర్రాడప్పుడు. మంగత్త గారి సంతానము ద్విదళ రూప కళ గా విభక్త మయినది. తెల్లని ఆర్య దీప్తి గలవారు నల్లని కృష్ణ ఛాయా ప్రదీప్రి గల వారూనూ. మనింటి అంటే maringanti సంతులోనూ అలాగే కానీ చామన ఛాయ పోట మరింపెక్కువ. తెలివీ వైదుష్యమూ కూడా విచిత్రం గా ప్రాలిఫరేట్ అయ్యాయి. అత్యంత ప్రతిభావంతులు కొద్ది మంది మాత్రమే వుంటారు. పరిస్తు తులని చేధించుకు పరిమళించిన ప్రసన్న కలితార్థత బహు కొద్దిమందికి మాత్రమే కలుగుతుంది. మన బట్టర్ అలాంటి వాడు. పెద్దక్క, భట్టరు విధి కూడిరాని భావ విపంచికలు. కడగొట్టు పాపాయిని మనం విధి వంచితుడనీ లేదా తెలివైన వాడనీ ఎంచలేము. సహజ బుద్భుదిత వికాసమున్నప్పటికీ నాలా ఆది భౌతికత హెచ్చు .తొణికిసలాడిన నీ జ్నాన మంజూషతృప్తమై వాడి మేధస్సు పరిమళించింది. మంగత్త గారి భర్త r రాఘవా చార్యులు మామ గారు , పెద నాయన గారు, తేలికిచర్ల గోపాలాచార్య స్వామి తుని నారాయణాచార్యులుగారు,,నాకు విద్య బిక్ష పెట్టినవారు, మనకెరికైన సంపత్కోవిదులు .
అరుదైన అందం
అరుదైన అధికారం
అరుదైన సౌభాగ్యం
అరుదైన విజ్ఞానం
ఏదైనా సరే పలువురికీ
ఆశ్చర్యకరం
అభినందనీయం
అలాటిది
ఎవరికైనా
ఏదైనా
ఉండ భయం
అదెలాగోఓలా మనపరం
ఐపోడమే పరమానందం
మాకు లేదేం ఖర్మం ?
అన్న అనుమానం
కొండకొచో అసహనం
ఈర్ష్యా అసూయలవేగడం
ఫలితంగా గొడవ పడడం
జీవనయానం లో అనవరతం
ప్రతిక్షణం చర్వితచర్వణం
సమస్త జీవుల జీవన పర్యంతం
బహుశః ఇది సర్వసామాన్యం
ఈ విషవలయం నుంచీ బయట పడి
అహంకారం
మమకారం
రాగం ద్వేషం
పూర్తిగా వదలిన వారికి
తాను కేవలం సాక్షీభూతం
అన్న సత్యం దృగ్గోచరం
ఐపోయిన నీ వంటి వారికి
గతం తాలూకు కధనం
భవ బంధ
విమోచనకారణం
జీవన గమనాన్ని
సాక్షీభావంతో
పునఃశ్చరణచేయగలడం
కర్మలేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం!!
ఇవేమొ నాకు పూర్తిగా తెలీవు కానీ నిక్కచ్చి గా గతం తలచుకోవడం మూలంగా ఒనగూడేదేమి వుంటుంది. బంకించంద్ర చట్టోపాధ్యయుడానాడు నిర్మల పాత్ర ద్వారా సాంఘిక వ్యవస్థ లోని విదారక దృశ్యాన్నవిష్కరించడం వల్ల ఏమి ఒరిగింది. తనని తాను ఆ పాత్రలో ప్రతిఫలింపజేసుకు అమ్మ తన వాస్తవికతా దృష్టిని హ్రస్వ పరుచుకుంది. మదరాసులో మన నివాసం స్వప్నం లాంటి నిజం. అది కరిగిపోయింది. బ్లూ అని పిలువ బడిన అందమైన పెద్దక్క భవితవ్యం బ్లాక్ గా బ్లీక్ గా మారిపోవడానికి అంకుశమూ, నిరంకుశమూ కారణాలు. అవి ఘటక ఘటిత పీడలైనాయి మనకి. మనమంటే అప్పటికి సగం పైగా సంసార జీమోతాన్నమ్మ అల్లుకోలా, వూలు స్వెట్టర్లల్లుకునే కళా, హిందీ టైప్ రైటింగ్ నేర్పు ప్రయత్నాల్లో పిల్లల. ఆలనా పాలనాలో పెద్దల సేవా ప్రస్థానంలో తలములకలుగా ఉండేది. మా అమ్మ మంచిదే కానీ విపరీత విధి ఎదురీతకి గురి చేసింది. నాయనగారు సైతం ప్రచార సభాపర్వం, ఆదిపర్వం, సంజీవరెడ్డి గారి ఇంట్లో చూపు లేని వారి పాపకి చదువు చెప్పడం, అప్పుడప్పుడు పట్టమ్మాల్ గారి కచేరీలు ఆనక పార్థసారథి స్వామి గుడి ప్రదక్షిణాలు బిజీగా ఉండేవారు...
No comments:
Post a Comment